Saturday, June 11, 2011

పీసీసీ పెత్తనం చేపట్టిన బొత్స

హైదరాబాద్,జూన్ 11:  : పీసీసీ అధ్యక్షుడుగా బొత్స సత్యనారాయణ శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గాంధీభవన్‌లో ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఆయన పీసీసీ చీఫ్‌గా డీ శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ,మాజీ సీఎంలు నేదురుమల్లి జానారెడ్డి  , రోశయ్య, డీఎస్,మంత్రులు, ఎమ్మెల్యేలు, దాసరి నారాయణరావు, కేకే పలువురు నేతలు హాజరు అయ్యారు. ఢిల్లీ పెద్దలకు, రాష్ట్ర నాయకత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటానని  బొత్స సత్యనారాయణ  ఈ  సందర్భంగా తెలిపారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నూతనోత్తేజం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. పభుత్వ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలను భాగస్వాములను చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 2014లో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీ మనుగడ కష్టమని సీఎం అన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్ మినహా జాతీయ పార్టీ అంటూ లేదని  అన్నారు.  జాతీయ ప్రాతినిథ్య రక్షణ కాంగ్రెస్ వల్లే సాధ్యమని పేర్కొన్నారు. తాము ప్రాంతీయ వాదులం కాదు, ఉప ప్రాంతీయ వాదులం కాదని జాతీయ వాదులమని అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...