బీభత్సంగా రాందేవ్ దీక్ష భగ్నం !

న్యూఢిల్లీ,జూన్ 5: అవినీతికి వ్యతిరేకంగా యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేపట్టిన నిరాహారదీక్షను శనివారం అర్థరాత్రి తర్వాత ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. 144 సెక్షన్ విధించిన పోలీసులు దీక్షా ప్రాంగణాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. బాబా మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. పోలీసుల దాడిలో పెద్ద సంఖ్యలో బాబా రామ్‌దేవ్ మద్దతుదారులు గాయపడ్డారు. దీక్షా వేదిక పూర్తిగా ధ్వంసమయింది. రామ్‌దేవ్‌ను ఆదివారం ఉదయం హరిద్వార్ లోని ఆయన ఆశ్రమానికి తరలించారు. దేశరాజధానిలో 15 రోజులపాటు అడుగుపెట్టకుండా యోగా గురువు బాబా రాందేవ్‌పై ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. రామ్‌లీలా మైదానంలో భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ కార్యకర్తలకు యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనుమతి ఉందని  పోలీసులు తెలిపారు.  ఆయనపై పోలీసులు దొమ్మీ కేసు నమోదు చేశారు. కాగా,ఆశ్రమంలోనే దీక్షని కొనసాగిస్తానని రాం దేవ్  ప్రకటించారు. తనను చంపడానికి యు.పి.ఎ. ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. నల్ల ధనవంతులు తనను ఢిల్లీ నుంచి గెంటివేశారని  ఆయన విమర్శించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు