Wednesday, June 1, 2011

అందాల పోటీల్లో పాల్గొందని చంపిపారేశారు...!

ఉక్రెయిన్‌లో ఛాందసవాదుల దురాగతం
లండన్,జూన్ 1: అందాల పోటీల్లో పాల్గొని షరియా చట్టాన్ని ఉల్లంఘించిందంటూ ఓ ముస్లిం యువతిని ఛాందసవాద యువకులు రాళ్లతో కొట్టిచంపారు. ఉక్రెయిన్‌లో  ఈ దురాగతం జరిగింది.  ఇటీవల అందాల పోటీల్లో పాల్గొని ఏడో స్థానంలో నిలిచిన క్రిమియా ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన కతియా కోరెన్ (19) అనే యువతిని ముగ్గురు ముస్లిం యువకులు ఆమె ఇంటి సమీపంలో రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని అడవిలో పాతిపెట్టారు. కోరెన్ మృతదేహం ఆమె అదృశ్యమైన వారం రోజులకు  అడవిలో లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు పాల్పడినవారిలో బిహాల్ ఘాజీవ్ (16)  అనే యువకుడిని అరెస్టుచేసినట్లు చెప్పారు. ‘ కోరెన్ షరియా చట్టాన్ని ఉల్లంఘించింది. అందుకే ఆమెను హతమార్చాం. అందుకు ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదు ’ అని బిహాల్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇస్లాం చట్టం ప్రకారం అపరాధులను రాళ్లతో కొట్టిచంపడం అనే శిక్షపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనిని కొందరు ముస్లింలు వ్యతిరేకిస్తుండగా, మరి కొందరు సమర్థిస్తున్నారు. గత ఏడాది ఇరాన్‌లో షరియా చట్టాన్ని ఉల్లంఘించారంటూ 10 మంది మహిళలను, నలుగురు పురుషులను రాళ్లతో కొట్టిచంపారు. పాకిస్థాన్, నైజీరియాలలో కూడా ఇలాంటి శిక్షలు అమలవుతున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...