Friday, June 3, 2011

జగన్ వెంట 34 మంది శానససభ్యులు...?

మరో ఆరుగురు కూడితే సర్కార్ కూలినట్టే...! 
హైదరాబాద్,జూన్ 3: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట 34 మంది శానససభ్యులున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో ఆరుగురిని కూడగడితే ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే,  జగన్ శుక్రవారం సాయంత్రం ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి  పార్టీ శానససభ్యురాలు వైయస్ విజయమ్మ కాకుండా 22 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. కుంజా సత్యవతి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, సుచరిత, రామచంద్రా రెడ్డి, రవి, ఆదినారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కొండా సురేఖ, శేషారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ప్రసాద రాజు, బాలరాజు, కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాస్, బాబూరావు, శ్రీనివాసులు, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జయసుధ, శోభానాగి రెడ్డి, అమర్నాథ్ రెడ్డిసమావేశానికి హాజరయ్యారు. ఎప్పుడూ  జగన్ వెంట నడిచే బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశానికి రాలేదు. అయినా వీరిద్దరు, వారితో పాటు   ఆళ్ల నాని, జోగి రమేష్ తదితరులు  కూడా జగన్ వెంట ఉంటారని భావిస్తున్నారు. పలువురు శాసనసభ్యులతో జగన్ ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ ప్రమాణ స్వీకారానికి శుక్రవారం ఉదయం 13 మంది శాసనసభ్యులు వచ్చారు. సాయంత్రానికి ఆ సంఖ్య 22కి పెరిగింది. స్పీకర్ ఎన్నిక విషయంలో, అవిశ్వాస తీర్మానం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ శానససభ్యులతో విడివిడిగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన సంఖ్యను కూడగట్టేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యనేతల సమావేశానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి కూడా హాజరయ్యారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...