కింగ్స్టన్,జూన్ 23: మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. ప్రత్యర్థి ముందు 326 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 91/3 ఓవర్నైట్ స్కోరుతో మూడోరోజు బుధవారం ఆట కొనసాగించిన భారత్ 252 పరుగులకు ఆలౌటయింది. ద్రావిడ్ 112 (274 బంతులు, 10 ఫోర్లు, సిక్సర్) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టెస్ట్ లలో ద్రావిడ్కిది 32వ సెంచరీ.ముకుంద్ 25, కొహ్లి 15, రైనా 27, ధోనీ 16, హర్భజన్ 5, మిశ్రా 18, ఇషాంత్ శర్మ 5 పరుగులు చేశారు. విజయ్, లక్ష్మణ్, ప్రవీణ్కుమార్ డకౌటయ్యారు. విండీస్ బౌలర్లలో స్యామీ, బిషూ నాలుగేసి వికెట్లు తీశారు. ఎడ్వార్డ్స్, రామ్పాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 326 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 80 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. భరత్ (38)ను ప్రవీణ్ కుమార్ అవుట్ చేశాడు. శర్వాణ్(0), సిమన్స్(27)లను ఇషాంత్శర్మ పెవిలియన్కు పంపాడు. 81/3 స్కోరుతో విండీస్ ఆట కొనసాగిస్తోంది. బ్రేవో(9), చందర్పాల్(1)లో క్రీజ్లో ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment