న్యూఢిల్లీ,జూన్ 2 : కేంద్ర జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్ చుట్టూ 2జీ స్పెక్ట్రమ్ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఆయన టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ఈ కుంభకోణంలో మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలు జైలుకెళ్లడానికి కారణమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాల సంస్థ (సీపీఐఎల్) ఈ పిటిషన్ వేసింది. మరోవైపు.. తానే తప్పూ చేయలేదని మారన్ స్పష్టం చేశారు. 2005-07 మధ్య మారన్ టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు మలేసియాకు చెందిన మాక్సిస్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని సీపీఐఎల్ ఆరోపించింది. మారన్ ఎయిర్సెల్ కంపెనీకి యూఏఎస్ లెసైన్సులు ఇవ్వకుండా వేధించారని, దీంతో ఎయిర్సెల్ను ఆ కంపెనీ యజమాని శివశంకరన్ మలేసియాకు చెందిన ఆనందకృష్ణన్ యాజమాన్యంలోని మాక్సిస్కు అమ్మేశారని, తర్వాత మూడునెలలలోపే మాక్సిస్(ఎయిల్సెల్) మారన్ కుటుంబ నేతృత్వంలోని సన్టీవీలో 20 శాతం షేర్లు కొనుక్కుని రూ.599 కోట్ల పెట్టుబడులు పెట్టిందని, మరోవైపు.. మాక్సిస్ గ్రూప్ కూడా మారన్గ్రూప్కు చెందిన సౌత్ ఆసియా ఎఫ్ఎం కంపెనీలో రూ.111 కోట్ల పెట్టుబడులు పెట్టిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment