Monday, May 9, 2011

అయోధ్య కధ మళ్ళీ మొదటికి...!

న్యూఢిల్లీ,మే 9: :  అయోధ్య వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ను సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.  తదుపరి ఆదేశాలు వెలువడేవరకూ యథాతథస్థితి కొనసాగించాలని జస్టిస్ అప్తాబ్ అలం, ఆర్‌ఎం లోధాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. స్థలాన్ని విభజించాలని ఎవరూ కోరలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమితో పాటు, వివాదాస్పద స్థలంలో కూడా యథాతధ స్థితి కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే వివాదరహిత 67 ఎకరాలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...