Sunday, May 8, 2011

గెలిస్తే చాలదు...భారి మెజారిటీ వస్తేనే రాజకీయ మనుగడ...!

హైదరాబాద్,మే 8:  జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా నిలిచిన పులివెందుల, కడప ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. కడప పార్లమెంటు నుండి జగన్ విజయావకాశాలపై ఎవరికీ అనుమానం లేకున్నప్పటికీ ఎంత ఆధిక్యం అనే దానిపైనే జగన్ పరువు ఆధార పడి ఉంది. గత సాధారణ ఎన్నికలలో జగన్ లక్షా డెబ్బై వేల ఓట్లతో గెలిచాడు. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ రావాలని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేసింది. అదేవిధంగా జగన్ ఆధిక్యాన్ని లక్షకన్నా తగ్గించాలని కాంగ్రెసు, టిడిపిలు ప్రయత్నాలు చేశాయి. జగన్ విజయం దాదాపుగా ఖాయమైనప్పటికీ ఆధిక్యత మాత్రం భారీగా ఉంటేనే ఆయన ప్రభావం ఉన్నట్టుగా అందరూ గుర్తించేలా కనిపిస్తోంది. లేదంటే వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీలో జగన్ తప్ప మరే సీటు గెలిచే అవకాశమే లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  వైయస్ దుర్మరణం, కాంగ్రెసు నుండి బయటకు రావడం, గత ముప్పయ్యేళ్లుగా కడపలో వారి కుటుంబమే రాజ్యమేలుతున్న నేపథ్యంలో జరిగిన ఎన్నికలు కావడం తో  జగన్ ఇది వరకు గెలిచినట్లుగా సాధారణంగా గెలిస్తే ఆయన ప్రభావం పెద్దగా వుండదని అంటున్నారు. 
ఇక పులివెందుల నియోజవర్గంలో కూడా విజయమ్మ గెలుపు జగన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. పులివెందులలో మాత్రం విజయమ్మ గెలిచే అవకాశాలు ఎంతగా ఉన్నాయో, ఓడిపోయే అవకాశాలు అంతే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ జగన్‌కు అత్యంత ముఖ్యమైన పులివెందులలో విజయమ్మ ఓడిపోయినా జగన్ కు ద్బ్బే  అంటున్నారు పరిశీలకులు. ఓటింగ్ శాతం గతంలో కంటే కొద్దిగా పెరిగినప్పటికీ ఓటర్లు ముప్పయ్యేళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేశారనే భావన అందరిలో ఉంది. ఈ పరిస్థితి  ఖచ్చితంగా జగన్ మెజార్టీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. 



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...