ముంబై,మే 20: ఇక్కడి డీవైపాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ పుణే వారియర్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోగా... పుణే వారియర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. యువరాజ్ సింగ్ (26 బంతుల్లో 24; 2 ఫోర్లు) టాప్స్కోరర్. గంగూలీ (22 బంతుల్లో 18; 1 సిక్సర్), రాణా (16 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కోల్కతా బౌలర్లలో పఠాన్, షకిబుల్, బాలాజీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోల్కతా జట్టు 16.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసి గెలిచింది. కలిస్కు గాయం కావడంతో ఓపెనర్గా వచ్చిన గంభీర్ (46 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు) ఇన్నింగ్స్ ఆద్యంతం చక్కగా ఆడి అజేయ అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఫామ్లో ఉన్న మనోజ్ తివారీ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) కెప్టెన్కు అండగా నిలిచాడు. మరోస్టార్ యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా పరుగులు చేసి మ్యాచ్ను తొందరగా ముగించాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment