Friday, May 20, 2011

పుణే వారియర్స్ కు మరో ఓటమి

ముంబై,మే 20:  ఇక్కడి డీవైపాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్  పుణే వారియర్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా... పుణే వారియర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. యువరాజ్ సింగ్ (26 బంతుల్లో 24; 2 ఫోర్లు) టాప్‌స్కోరర్. గంగూలీ (22 బంతుల్లో 18; 1 సిక్సర్), రాణా (16 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కోల్‌కతా బౌలర్లలో పఠాన్, షకిబుల్, బాలాజీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోల్‌కతా జట్టు 16.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసి గెలిచింది. కలిస్‌కు గాయం కావడంతో ఓపెనర్‌గా వచ్చిన గంభీర్ (46 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు) ఇన్నింగ్స్ ఆద్యంతం చక్కగా ఆడి అజేయ అర్ధసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఫామ్‌లో ఉన్న మనోజ్ తివారీ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) కెప్టెన్‌కు అండగా నిలిచాడు. మరోస్టార్ యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా  పరుగులు చేసి మ్యాచ్‌ను తొందరగా ముగించాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...