Wednesday, May 25, 2011

ఫైనల్లో‌ చెన్నై సూపర్ కింగ్స్

ముంబై,మే 25: :  ఐపీఎల్-4 లో  ఇక్కడి  వాంఖేడి స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి ప్లేఆఫ్ మ్యాచ్‌లో బెంగళూర్‌ పై చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఫైనల్‌కు చేరింది.  టాస్ గెలిచి బెంగళూర్‌కు బ్యాటింగ్ అప్పగించిన చెన్నైకు భారీ లక్ష్యమే ఎదురైంది. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ రన్‌రే ట్‌ను కాపాడుకుంటూ ముందుకు సాగింది.  రైనా -మోర్కెల్‌జోడి  వరుస సిక్సర్లు, ఫోర్లుతో విరుచుకుపడి చెన్నై గెలుపు ఖాయం చేశారు. రైనా (73), మోర్కెల్ (28) పరుగులు చేశారు. చివరి వరకూ పోరాడిన బెంగళూర్‌కు ఓటమి తప్పలేదు. ఇంకా రెండు బంతులు ఉండగానే చెన్నై విజయం సాధించి ఫైనల్లో బెర్తు ఖాయం చేసుకుంది. ఎలిమినేటర్ స్థానంలో ఉన్న బెంగళూర్ ఫైనల్ బెర్తు కోసం మరో మ్యాచ్ చూడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తన తదుపరి మ్యాచ్‌లో ముంబై-కోలకతా మ్యాచ్ విజేతతో బెంగళూర్ తలపడనుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...