Wednesday, May 18, 2011

అస్సాం ముఖ్యమంత్రిగా తరుణ్ గగోయ్ ప్రమాణస్వీకారం

గౌహతి,మే 19: అస్సాం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తరుణ్ గగోయ్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. గౌహతిలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి గగోయ్ మద్దతుదారులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అస్సాంలో పూర్తి స్థాయిలో శాంతిని నెలకొల్పడానికి, అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడానికి తాను కట్టుబడి వున్నానని తరుణ్ గగోయ్ ప్రమాణస్వీకార అనంతరం  తెలిపారు. అస్సాంలో రెండుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) ని మట్టి కరిపించి  గగోయ్ కాంగ్రెస్ పార్టీని వరుసగా మూడోసారి అధికారంలోకి తెచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఏజీపీ పార్టీ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...