సత్తా చూపిన పంజాబ్ కింగ్స్

ధర్మశాల,మే 18: ఇక్కడి హెచ్‌పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐ.పి.ఎల్. మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు 111 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వాల్తాటి (17 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆరంభంలో వేగంగా ఆడాడు. వాల్తాటి ఉన్నంతసేపు ప్రేక్షక పాత్ర పోషించిన గిల్‌క్రిస్ట్... ఆ తర్వాత  చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లను బెదరగొట్టాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై ఘోరపరాజయాన్ని చవిచూసింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు