న్యూఢిల్లీ,మే 29: వరకట్న వేధింపుల కేసులో చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పరస్పర అంగీకారం కోసం రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కావున తన క్లయింట్ కు బెయిల్ ఇప్పించాలన్న శిరీష్ తరపున న్యాయవాది అభ్యర్థనను జీఎస్ సింఘ్వీ, చంద్రమౌళి ప్రసాద్లతో కూడిన బెంచ్ తిరస్కరించింది. కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా 2007 సంవత్సరంలో హైడ్రామాతో శిరీష్ వివాహం చిరంజీవి కూతురు శ్రీజతో జరిగింది. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా శిరీష్ దంపతులు రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆతర్వాత శిరీష్ దంపతులు మీడియా కాన్ఫరెన్స్లో తమ పెళ్లిని చెడగొట్టేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే నాలుగేళ్ల తర్వాత నాటకీయంగా శిరీష్పై వరకట్న వేధింపుల కేసును తన తల్లితో కలిసి శ్రీజ దాఖలు చేసింది. ఈ కేసులో శిరీష్కు హైదరాబాద్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment