రసాభాసగా తెలుగుదేశం 'తెలంగాణ రణభేరీ'

కరీంనగర్,మే 26‌: తెలుగుదేశం తెలంగాణ ఫోరం తలపెట్టిన తెలంగాణ రణభేరీ బహిరంగ సభతో కరీంనగర్ రణరంగంగా మారింది. పార్టీ జెండాను పెట్టి తెలంగాణ సభ నిర్వహించాలనే తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుల ప్రయత్నానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. హైదరాబాదు నుంచి బయలుదేరిన తెలుగుదేశం నాయకులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. పోలీసుల సహకారంతో ఎట్టకేలకు బుధవారం సాయంత్రం వారు కరీంనగర్ చేరుకోగలిగారు. రణభేరీ బహిరంగ సభలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులంతా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినా 12 మంది గైర్హాజయ్యారు. నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలాచారిలకు ఆహ్వానాలే  వెళ్లలేదు. కాగా, కరీంనగర్ కమాన్ వద్ద తెలుగుదేశం నాయకుల పైకి తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి కారుపై రాళ్లతో తెలంగాణవాదులు దాడి కూడా చేశారు. కరీంనగర్ తెలుగుదేశం పార్టీ కార్యలయానికి దుండగులు నిప్పు పెట్టారు. తీవ్రమైన ఉద్రిక్తత మధ్య తెలంగాణ రణభేరీ బహిరంగ సభ  సాయంత్రానికి ప్రారంభమైంది. కాగా, టీడీపీ జెండా తోనే తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని రణభేరి సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు