Thursday, May 12, 2011

సివిల్స్ లో రాష్ట్రానికి ర్యాంకుల పంట


శ్వేతామహంతి
హైదరాబాద్, మే 12:  దేశంలో అత్యున్నత స్థాయి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు  ర్యాంకుల పంట పండించారు. రాష్ట్ర క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పి.కె.మహంతి కూతురు శ్వేతామహంతి తన మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో మొదటి వంద లోపు ర్యాంకర్లలో మన రాష్ట్రానికి చెందిన వారు 18 మంది ఉన్నారు. 2, 12, 13, 18, 23, 24, 25, 26, 31, 37, 52, 53, 54, 57, 83, 90, 94, 96  ర్యాంకుల్ని రాష్ట్ర అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. ఈసారి సివిల్స్ మొదటి రెండు ర్యాంకులూ మహిళలే సాధించటం విశేషం. చెన్నైకి చెందిన ఎస్.దివ్యదర్శిని ఈ ఏడాది ఐఏఎస్ టాపర్‌గా నిలిచారు. చెన్నైలోని అంబేద్కర్ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన దివ్యదర్శిని.. ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె తన రెండో ప్రయత్నంలో సివిల్స్ టాపర్‌గా నిలిచారు. రెండో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన శ్వేతా మొహంతి సాధించగా.. మూడో ర్యాంకును చెన్నైకే చెందిన దంతవైద్యుడు ఆర్.వి.వరుణ్‌కుమార్ సాధించారు. టాప్ 25లో అత్యధికంగా 15 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉండగా, ఐదుగురు వైద్య పట్టభద్రులు, మిగిలిన ఐదుగురు సైన్స్, మేనేజ్‌మెంట్, కామర్స్, సోషల్ సెన్సైస్ పట్టభద్రులు ఉన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...