Sunday, May 29, 2011

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీ

చిరు వర్గానికి మొండి చెయ్యి...
వై.ఎస్.వివేకాకు నో చాన్స్...
హైదరాబాద్ ,మే 29:   రెండు నెలలపాటు పెండింగ్‌లో ఉంచిన గవర్నర్ కోటా శాసనమండలి సభ్యుల నియామకాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఖరారు చేసింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తన కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎ.చక్రపాణి, డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్, రెడ్డెప్పరెడ్డి, అంగూరి లక్ష్మీశివకుమారిలను నామినేట్ చేశారు. గత మార్చి 29వ తేదీ వరకూ సభ్యులుగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలకు ఉద్వాసన పలికారు. మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డితో పాటు.. కాంగ్రెస్‌లో విలీనం కానున్న ప్రజారాజ్యం పార్టీకి కూడా అధిష్టానం మొండిచేయి చూపింది. ఐఎన్‌టీయూసీ నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్ కుమార్తె మజ్జి శారదకు బదులుగా ఇద్దరు కొత్త వారికి అవకాశం లభించింది. మార్చిలో పదవీ కాలం ముగిసిన శాసనమండలి మాజీ చైర్మన్ ఎ.చక్రపాణి, డి.రాజేశ్వర్‌రావులకు మాత్రమే మళ్లీ అవకాశం ఇచ్చారు. వాస్తవానికి నాలుగేళ్ల పదవీ కాలానికి నామినేట్ అయిన నలుగురు ఎమ్మెల్సీలు మార్చిలో పదవీ విరమణ చేసినా.. కడప లోక్‌సభ, పులివెందుల శాసనభ స్థానాలకు ఉపఎన్నికలను సాకుగా చూపి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త సభ్యుల ఎంపికను వాయిదా వేయించారు. అప్పటి నుంచీ ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరో ఎమ్మెల్సీ కోలా రాజ్యలక్ష్మి మృతితో మరో రెండేళ్ల పదవీకాలం గల స్థానం కూడా అంతకు ముందే ఖాళీ అయింది. కోలా రాజ్యలక్ష్మి స్థానంలో శివకుమారి నియుక్తులయ్యారు. ఆమె పదవీ కాలం రెండేళ్లు (2013 మార్చి వరకు) ఉంటుంది. మిగతా నలుగురు ఆరేళ్లు కొనసాగుతారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...