ముంబై,మే 24: అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఎంపికయిన ఐదుగురు ప్రతిభావంతులైన విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ద్వారకా తిరుమలకు చెందిన శ్రీచైతన్య విద్యార్థి పృథ్వీ తేజ , హైదరాబాద్కు చెందిన బుర్లె సాయి కుమార్ ఈ ఘనత సాధించారు. జూలై 10 నుంచి 18 వరకు బ్యాంకాక్లో నిర్వహించే అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో వీరు పాల్గొంటారు. ఈసారి 80 దేశాల విద్యార్థులు ఒలింపియాడ్లో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆణిముత్యాలను వెలికితీసేందుకు 1967లో అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ను స్థాపించారు. దేశం నుంచి ఎంపికైన మరో ముగ్గురిలో జైపూర్(రాజస్థాన్)కు చెందిన నిశీత్ లహోటీ, కోటా (రాజస్థాన్)కు చెందిన శుభం మెహత్రా, బటిండా(పంజాబ్)కు చెందిన సుమేఘ గార్గ్ ఉన్నారు. వీరందరికన్నా పృథ్వీ తేజ్ చిన్న వయస్కుడు కావడం విశేషం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment