Saturday, May 28, 2011

మహానాడు లో లోకేష్ ఫ్లెక్సీల పై హరికృష్ణ గరం...!

 బాబు దిద్దుబాటు యత్నం... ?
హైదరాబాద్,మే 28:  నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టిన నాయకులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా నాయకుడు విజయ్‌బాబును ఆయన మందలించారు. మహానాడు వేదికపై నారా లోకేష్ ఫ్లెక్సీని పెట్టి తన ఫ్లెక్సీని పెట్టకపోవడంపై రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు  సమాచారం అందిన నేపథ్యంలో ,తన కుమారుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.  లోకేష్ ఫ్లెక్సీలు పెట్టడం వంటి చర్యలను తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయడం, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రాకపోవడం వంటి కారణాలతో చంద్రబాబు వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలకు దిగినట్లు చెబుతున్నారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎటువంటి తీర్మానాలు చేయవద్దని ఆయన సూచించారు. అనవసరమైన వివాదాలకు కారణం కావద్దని ఆయన అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...