Sunday, May 29, 2011

పార్టీని రక్షించుకోవడం కోసమే ఎన్‌టీఆర్‌పై తిరుగుబాటు

మహానాడు లో బాబు వివరణ  
హైదరాబాద్ ,మే 29:  తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశం మహానాడు ఆదివారం ముగిసింది. ఈ మహానాడులో 14 తీర్మానాలను ప్రవేశపెట్టినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ మహానాడును రైతులకు అంకితం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తెలుగుదేశం  పార్టీని రక్షించుకోవడం కోసమే ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్టీయార్‌పై తిరుగుబాటు చేశానని.. 200 మంది ఎమ్యెల్యేలతో నాయకత్వ మార్పు చేశానని చంద్రబాబునాయుడు  ముగింపు ప్రసంగంలో అన్నారు.   దివంగత నేత ఎన్‌టీఆర్‌పై తిరుగుబాటు చేస్తాననుకోలేదని,  పార్టీ నాశనం కోసం ఓ దుష్టశక్తి ప్రయత్నించిందని.. దాన్ని అడ్డుకోవడం కోసమే ఎంటీఆర్కు  వ్యతిరేకంగా ఎదురు తిరుగాల్సి వచ్చిందన్నారు.  రాజకీయం వేరు.. బంధుత్వం వేరని అన్నారు. పార్టీలో తన కుటుంబం ఎన్నడూ తలదూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో చెప్పాల్సింది చెప్పా, కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.1995-2004 కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని ఆయన అన్నారు. రైతుల కోసం అవిశ్వాస తీర్మానానికి సిద్ధమని.. అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొడతామని ఆయన అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...