భారత సైంటిస్టుకు అంతర్జాతీయ ఫెలోషిప్
ముంబై, మే 26: రసాయన శాస్త్రంలో మైక్రోమాలిక్యూల్స్ విభాగంలో చేసిన పరిశోధనలకుగాను భారత్కు చెందిన డాక్టర్ జయంత్ కందారే ప్రతిష్టాత్మకమైన అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. జయంత్ ప్రస్తుతం పిరామల్ లైఫ్ సెన్సైస్ లిమిటెడ్లో పనిచేస్తున్నారు. ఈ ఫెలోషిప్కు ఎంపికైన వారిలో ఇప్పటివరకు 44 మంది నోబెల్ బహుమతిని గెలుచుకోవడం గమనార్హం. జర్మనీకి చెందిన హంబోల్ట్ ఫౌండేషన్ పరిశోధన రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించడానికి ఈ ఫెలోషిప్ను అందజేస్తోంది. డాక్టర్ జయంత్ ముంబై యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో పోస్ట్గ్రాడ్యుయేషన్, పూణెలోని నేషనల్ కెమికల్ లాబరేటరీనుంచి పీహెచ్డీ చేశారు. కేన్సర్ కణాలను నాశనం చేసే ఔషధాలపై జయంత్ పరిశోధనలు చేస్తున్నారు.
Comments