Sunday, May 22, 2011

ముంబై ఇండియన్స్ సంచలన విజయం

బెంగళూరు,మే 22: ఈడెన్‌ గార్డెన్లో  ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ను ఓడించింది. టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కలిస్ (42 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)  అర్ధసెంచరీ సాధించాడు. మనోజ్ తివారీ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్సర్), యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడారు. ముంబై బౌలర్లలో అబు నెచిమ్, ఫ్రాంక్లిన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.  ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి ఆఖరి బంతికి గెలిచింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన ఫ్రాంక్లిన్‌ (47) కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...