లోక్‌పాల్‌పై రాష్ట్రాలకు, రాజకీయపార్టీలకు లేఖ

న్యూఢిల్లీ,మే 31:  లోక్‌పాల్ బిల్లుపై వివిధ రాష్ట్రాలోని ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేఖలు రాశారని కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలిపారు. ప్రధాన మంత్రిని, పార్లమెంట్ సభ్యులను, ఉన్నత న్యాయవ్యవస్థల్ని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలా అనే విషయంపై రాష్ట్రాల నుంచి, రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని సేకరించేందుకు లేఖ రాశారని ఆయన తెలిపారు. అంతేకాక ఉన్నత పదవుల్ని నిర్వహిస్తున్న వారిని లోక్‌పాల్ లేదా లోకయుక్తాపరిధిలోకి తీసుకురావాలా అని  లేఖలో అడిగినట్టు ఆయన తెలిపారు. ఈ విషయంపై పౌర సమాజంలోని సభ్యుల, రాజకీయ పార్టీల, నిపుణుల మధ్య ఏకాభిప్రాయం కుదురలేదన్నారు. ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరేలా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు