ఆఫ్రికా దేశాలకు భారత్ వరాలు

ఆడిస్ అబాబా,మే 25: :  ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నూతన సహకారాత్మక సంఘీభావం చోటుచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. భారత్, ఆఫ్రికాలోని 15 దేశాలు పాల్గొన్న ‘ఆఫ్రికా- ఇండియా ఫోరం’ రెండో శిఖరాగ్ర సదస్సు ప్లీనరీలో మంగళవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆఫ్రికా దేశాలకు ఆయన పలు వరాలు ప్రకటించారు. మూడేళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేలా 500 కోట్ల డాలర్ల రుణంతో పాటు ఆ దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు, సామర్థ్య పెంపుదలకు సాధ్యమైనంత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అంతేకాకుండా మరో 70 కోట్ల డాలర్లను కొత్త సంస్థల ఏర్పాటు, శిక్షణ అవసరాల కోసం.. మరో 30 కోట్ల డాలర్లను ఇథియో-జిబౌతి రైల్వేలైన్ నిర్మాణానికి అందజేయనున్నట్లు వెల్లడించారు. 2008లో న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ‘ఆఫ్రికా- ఇండియా ఫోరం’ సదస్సులో ప్రధాని ప్రకటించిన 540 కోట్ల డాలర్ల రుణానికి ప్రస్తుతం ప్రకటించిన రుణ మొత్తం అదనం. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు