Friday, May 20, 2011

కిరణ్ క్యాబినెట్ లో జగన్ కోవర్టులు...!

 లిస్ట్  లో కోమటిరెడ్డి , మోపిదేవి, తోట నర్సింహం, విశ్వరూప్, పితాని... 
హైదరాబాద్ ,మే 20:  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టులు ఉన్నారా...!  కాంగ్రెస్  రాష్ట్ర పరిశీలకుడు గులాం నబీ ఆజాద్ కు   పలువురు కాంగ్రెసు నేతలు ఈ విషయం చెప్పారని తెలిసింది. అంతేకాదు ముఖ్యమంత్రి కూడా తనపై ఫిర్యాదులకు కారణం జగన్ కోవర్టులే అని అధిష్టానానికి వివరణ కూడా ఇచ్చుకున్నారంట. ముఖ్యమంత్రి కిరణ్ మంత్రివర్గం ఒక్కటే అయినప్పటికీ అందులో నాలుగు గ్రూపులు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వర్గం, అధిష్టానం వర్గం, జగన్ వర్గం, గోడమీది పిల్లిలా మరో వర్గాలు కేబినెట్‌లో ఉన్నాయని సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ గ్రూపులో డిఎల్ రవీంద్రారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, శ్రీధర్ రెడ్డి, గల్లా అరుణకుమారి తదితరులు ఉండగా, అధిష్టానం విదేయులలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మీనారాయణ, శంకర్ రావు, గీతారెడ్డి తదితరులు ఉన్నారు. గోడ మీది పిల్లుల్లా వ్యవహరిస్తున్న వారు కూడా కేబినెట్లో చాలామందే ఉన్నారంట. రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, రాంరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు గోడమీది పిల్లుల్లా ఉంటూ ఎటు లాభం చేకూరితే అటు ఉండటానికి తయారయి ఉన్నారని తెలుస్తోంది. కాగా, మంత్రివర్గంలో జగన్ వర్గానికి చెందిన వారు దాదాపు ఐదుగురు ఉన్నారని సమాచారం. అందులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు నిత్యం వినబడుతూనే ఉంటుంది. కోమటిరెడ్డితో పాటు మోపిదేవి వెంకటరమణ, తోట నర్సింహం, విశ్వరూప్, పితాని సత్యనారాయణ పేర్లు జగన్ వర్గం మంత్రులుగా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరెవరూ కూడా జగన్‌ను బహిరంగంగా సమర్థించిన దాఖలాలు లేక పోవడం విశేషం. అయితే అవకాశం వస్తే మాత్రం జగన్‌కు లాభం కలిగించడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...