Sunday, May 22, 2011

బెంగళూరు నెంబర్‌వన్

బెంగళూరు,మే 22:  స్థానిక చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచిన రాయల్స్ చాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 128 పరుగులు  చేయగలిగింది. కెప్టెన్ ధోని (40 బంతుల్లో 70; ఫోర్లు 3, సిక్స్ 6) ఒంటరి పోరాటం చేసినా, రెండో ఎండ్‌లో సహకరించే బ్యాట్స్మన్ కరవయ్యాడు. ధోనిని మినహాయిస్తే సాహా (30 బంతుల్లో ఫోర్, సిక్స్తో  22) ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడు.  అనంతరం బరిలోకి దిగిన వెటోరి సేన 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయానికి అవసరన్మైన  129 పరుగులు సాధించింది. కొహ్లి 29 బంతుల్లో 31 పరుగులు చేశాడు. . మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గేల్‌కు దక్కింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...