Friday, May 13, 2011

బెంగాల్ లో మమత విజయకేతనం-తమిళనాట జయ భేరి

కేరళలో యు.డి.ఎఫ్.
అస్సోం లో కాంగ్రెస్ హ్యాట్రిక్
పుదుచ్చేరిలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ,మే 13; అయిదు రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికలలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్ లో మూడు దశాబ్దాల వామపక్ష పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ నాయకత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. తమిళనాడులో డిఎంకెని కూడా ప్రజలు ఓడించారు. అక్కడ అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత నాయకత్వంలోని కూటమి ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని స్థానాలు గెలుచుకుంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ కూటమి మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పుదుచ్చేరిలో రంగస్వామి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది.
పశ్చిమ బెంగాల్
మొత్తం స్థానాలు - 294
తృణమూల్ కాంగ్రెస్  - 226
వామపక్షాలు - 62
ఇతరులు  - 6
కేరళ
మొత్తం స్థానాలు - 140
యుడిఎఫ్ - 72
ఎల్.డి.ఎఫ్.  - 68
అస్సాం
మొత్తం స్థానాలు - 126
కాంగ్రెస్  - 78
ఎజిపి  - 10
ఎయుడిఎఫ్  - 18
బిజెపి  - 5
ఇతరులు  - 15
పుదుచ్చేరి
మొత్తం స్థానాలు - 30
ఎఆర్ సి - 20
కాంగ్రెస్ కూటమి  - 9
ఇతరులు గెలిచిన స్థానాలు - 1

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...