Thursday, May 26, 2011

టీడీపీ నుంచి నాగం జనార్దనరెడ్డి సస్పెన్షన్‌

హైదరాబాద్, మే 26: తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నాగం జనార్దనరెడ్డిని    పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.  పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న నేత ఒకరికి ఎలాంటి షోకాజ్ నోటీసూ జారీ చేయకుండా ఏకంగా సస్పెండ్ చేయటం టీడీపీ చరిత్ర లో ఇదే ప్రథమం. ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న నాగం జనార్దనరెడ్డి కొద్దిరోజులుగా పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణా రాహిత్యంగా భావించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందని టీడీపీ ఒక  ప్రకటనలో పేర్కొంది. పర్సనల్ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగిస్తున్నందున నాగంపై చర్య తీసుకున్నామని   ప్రకటనలో తెలిపారు.
టీడీపీ సమైక్యవాదుల పార్టీ: నాగం ధ్వజం
నాగం జనార్దనరెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ ను ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకరరావు, మాజీ మంత్రి బోడ జనార్దన్, తెలుగుయువత ప్రధాన కార్యదర్శి చల్లా మాధవరెడ్డి, కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి కొత్త జైపాల్‌రెడ్డి  ఖండించారు.  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోరుతూ గళం విప్పినందుకు చంద్రబాబు నాగంకు సస్పెన్షన్‌ను బహుమతిగా ఇచ్చారని వారు విమర్శించారు. నాగం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ సమైక్యవాదుల పార్టీ అని, అది సమైక్యవాదానికే కట్టుబడి ఉందనే విషయం తన సస్పెన్షన్‌తో తేలిపోయింద న్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...