చెన్నై,మే 29: ఐపీఎల్-4 లో చెన్నై తిరిగి టైటిల్ను నిలబెట్టుకుంది. ధోని గ్యాంగ్ భారీ స్కోరు , కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్.. వెరసి చెన్నైను ఐపీఎల్-4 విజేతగా నిలిపింది. చెన్నై 58 పరుగుల తేడాతో బెంగళూర్ పై ఘన విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ వెటోరి సేన ఆదిలోనే కష్టాల్లో పడింది. గత బెంగళూర్ మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గేల్.. ఈ మ్యాచ్లో నిరాశపరిచి (0) పరుగులకే పెవిలియన్కు చేరడంతో బెంగళూర్కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇక ఛేదించడం తమ వల్ల కాదన్నట్టు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్కు చేరారు. అగర్వాల్(10), డివిలియర్స్ (18)), పోమర్బాక్ (2), వెటోరి (0), మిధున్ (11)లు వరుసుగా వికెట్లు సమర్పించుకోవడంతో బెంగళూర్ తొందరగానే చేతులెత్తేసింది. కోహ్లీ ఒక్కడే (35) పరుగులు చేసి ఫర్వాలేదనిపించుకున్నాడు. తివారీ (42) పరుగులతో కడ వరకూ క్రీజ్లో ఉన్నా మ్యాచ్ను గెలిపించలేకపోయాడు. బెంగళూర్ 147 పరుగులకే పరిమితమవ్వడంతో భారీ ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్టు తీయగా , జకాతీ రెండు, రైనా, బ్రేవోలకు తలో వికెట్టు దక్కింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment