రోశయ్యకు గవర్నర్ గిరీ...?
హైదరాబాద్ ,మే 29:మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య మధ్యప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన రోశయ్య మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించిన రోశయ్యకు గవర్నర్ పదవి కట్టబెట్టే అన్శాన్న్ని చర్చిందుకే రోశయ్యను సోనియా ఢిల్లీకి అహ్వానించినట్లు చెబుతున్నారు. రోశయ్య ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితిపై కాస్తా తీవ్రంగానే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియాకు ఆయన ఇటీవల ఓ లేఖ కూడా రాశారు. కాగా, హైదరాబాదులోని అమీర్పేట భూకుంభకోణం వల్ల రోశయ్య గవర్నర్గిరీకి ఆటంకాలు ఏర్పడతాయా అనేది అనుమానంగా ఉంది. ఈ కేసును పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కేసుపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎసిబి కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఎసిబి కోర్టు రోశయ్య పేరును క్లియర్ చేయడానికి మరో వారం రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయనను మధ్యప్రదేశ్ గవర్నర్గా నియమించే అవకాశాలున్నాయి.

Comments