హైదరాబాద్ ,మే 22: ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా టీడీపీ తరఫున కేంద్రానికి లేఖ పంపేలా తెలంగాణలోని గ్రామ, మండల, జిల్లా పార్టీ కార్యవర్గాలు మహానాడు లోపు తీర్మానాలు చేయాలని లేదా చంద్రబాబుకు లేఖలు రాయాలని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి కోరారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు తాము అనుకూలమని లేఖ పంపిన ప్పటికీ.. ఆ కమిటీకి కాలం చెల్లిందని, మరోమారు అదే కాపీని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరానికి పంపాలని కోరుతూ అంతకుముందు చంద్రబాబుకు నాగం లేఖ రాశారు. ప్రణబ్ కమిటీకి లేఖ రాసిన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ తెలంగాణకు వ్యతిరేకమనే సంకేతాలు ప్రజల్లో ఉన్నాయని, వాటిని తొలగించేందుకు మరోమారు లేఖ పంపాలని విజ్ఞప్తి చేశారు. తనకు పదవులపై ఆశలేదని, ప్రజలిచ్చిన ఎమ్మెల్యే పదవిని వారు ఆజ్ఞాపించినపుడు వదిలేసేందుకు సిద్ధమని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment