Friday, May 20, 2011

నెత్తురోడిన గడ్చిరోలి

రెండు  ఎన్‌కౌంటర్లలో  27 మంది నక్సల్స్, నలుగురు పోలీసుల మృతి
ముంబై, మే 20: మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగి లింది. గడ్చిరోలి జిల్లాలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో సుమారు 27 మంది నక్సల్స్ మృతి చెందినట్లు తెలిసింది.  నక్సల్స్ జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు కమాండర్, ఇద్దరు ఎస్పీవోలు  సహా నలుగురు పోలీసులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. జిల్లాలోని నర్గొండా ప్రాంతంలో ఉన్న పోలీసు స్టేషన్‌పై నక్సలైట్లు ఉదయం 7:30కు మెరుపుదాడి చేశారు. పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. సుమారు గంటన్నరపాటు పోలీసులు, నక్సలైట్ల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలి సమీపంలో ఇద్దరు సీనియర్ మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఓ మహిళా నక్సలైట్ కూడా ఉంది. నక్సల్స్ కాల్పుల్లో సీ-60 బెటాలియన్‌కు చెందిన చిన్న మెంట అనే కమాండర్ మృతిచెందారు. కాగా, బామ్రాగడ్ తాలూకాలోని తడ్‌గావ్ పరిసరాల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. రహదారిపై నక్సల్స్ అమర్చిన మందుపాతరను పోలీసులు వెలికితీసి తిరిగి వెళ్తుండగా నక్సల్స్ కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో సుమారు 12 మంది నక్సల్స్ మృతిచెంది ఉండవచ్చని తెలుస్తోంది. నక్సల్స్ కాల్పుల్లో ఎస్పీవోలు సుధాకర్, పుంగటి, కానిస్టేబుల్ సురేంద్ర పఠాన్ మరణించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...