మరోసారి పెట్రో వాత...!

న్యూఢిల్లీ,మే 15: పెట్రోల్ ధరలు  మళ్ళీ భగ్గుమన్నాయి. సామాన్యుడికి కేంద్రం మరోసారి పెట్రో వాత పెట్టింది. లీటర్ పెట్రోల్ కు రూ.5 పెంచింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కేంద్రం పెట్రోలు ధరలు పెంచుతూ ప్రకటన చేసింది. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.  గత తొమ్మిది నెలల్లో ఎనిమిదిసార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు ధరలు పెంచాయి. కాగా త్వరలో మరోమారు పెట్రోలు ధరల పెంపు ఉండవచ్చని చమురు సంస్థలు సూచనప్రాయంగా తెలిపాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.65 చిల్లర ఉండగా, పెరిగిన ధరతో రూ.71 చేరుకుంది. అలాగే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.63.37కు చేరింది. ఒక్కసారిగా పెట్రోల్ ధర అయిదు రూపాయిలు పెరగటంతో పెట్రోల్ బంక్ ల వద్ద వినియోగదారులు బారులు తీరారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు