న్యూఢిల్లీ,మే 15: పెట్రోల్ ధరలు మళ్ళీ భగ్గుమన్నాయి. సామాన్యుడికి కేంద్రం మరోసారి పెట్రో వాత పెట్టింది. లీటర్ పెట్రోల్ కు రూ.5 పెంచింది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కేంద్రం పెట్రోలు ధరలు పెంచుతూ ప్రకటన చేసింది. పెరిగిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. గత తొమ్మిది నెలల్లో ఎనిమిదిసార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు ధరలు పెంచాయి. కాగా త్వరలో మరోమారు పెట్రోలు ధరల పెంపు ఉండవచ్చని చమురు సంస్థలు సూచనప్రాయంగా తెలిపాయి. హైదరాబాద్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.65 చిల్లర ఉండగా, పెరిగిన ధరతో రూ.71 చేరుకుంది. అలాగే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.63.37కు చేరింది. ఒక్కసారిగా పెట్రోల్ ధర అయిదు రూపాయిలు పెరగటంతో పెట్రోల్ బంక్ ల వద్ద వినియోగదారులు బారులు తీరారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment