వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ

అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 

హైదరాబాద్,మే 26: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ. అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికైనట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. సభ్యత్వం, ఎన్నికల నిర్వహణ సమన్వయకర్తగా పీఎన్‌వీ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొల్లి నిర్మలా కుమారి, యువజన విభాగం అధ్యక్షుడిగా - పి. ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా - మద్దినేని అజయ్‌లను నియమించారు. పార్టీ సలహాదారులుగా డీఏ సోమయాజులు, సీసీ రెడ్డిలు వ్యవహరించనున్నారు. పార్టీ సెంట్రల్ గవర్నరింగ్ కౌన్సిల్ సభ్యులుగా... కొణతాల రామకృష్ణ, పెనుమత్స సాంబశివరాజు, వైవీ సుబ్బారెడ్డి, హాబీబ్ అబ్దుల్ రెహ్మన్, బి. కరుణాకర్ రెడ్డి. బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, జూపుడి ప్రభాకర్‌రావు, ఆర్‌కే రోజా సెల్వమణి, డీఏ సోమయాజులు, మాకినేని పెద్దరత్తయ్య, భూమా నాగిరెడ్డి, జక్కపూడి విజయలక్ష్మి, కణితి విశ్వనాథం, తోపుదుర్తి కవిత, బాలమణెమ్మ, ఎమ్ మారెప్ప, జంగ కృష్ణమూర్తి, మదన్‌లాల్ నాయక్, గిరిరాజ్ నాగేష్, గంపా వెంకటరమణలను నియమించారు. కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీలన్ని తాత్కాలికమేనని ఆపార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి తెలిపారు. పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి కమిటీలన్ని జూలైలో ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి స్థాయి కమిటీలను ప్లీనరీ సమావేశంలో ప్రకటిస్తామన్నారు.




Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు