కక్ష్యలో జీశాట్-8

బెంగళూరు,మే 22:  ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ప్రయోగించిన జీశాట్-8 ఉపగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్‌లో అమర్చిన 440 న్యూటన్ లిక్విడ్ అపోజీ మోటార్(ఎల్‌ఏఎం)ను 95 నిమిషాలపాటు మండించి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చారు. కర్ణాటకలోని హసన్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నియంత్రణ కేంద్రం నుంచి ఈ మొత్తం ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా శాస్త్రవేత్తలు నియంత్రించగలిగారు. ప్రస్తుతం 15 గంటల 56 నిమిషాలకోసారి ఉపగ్రహం తన కక్ష్యలో పరిభ్రమిస్తోందని తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు