కక్ష్యలో జీశాట్-8
బెంగళూరు,మే 22: ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ప్రయోగించిన జీశాట్-8 ఉపగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్లో అమర్చిన 440 న్యూటన్ లిక్విడ్ అపోజీ మోటార్(ఎల్ఏఎం)ను 95 నిమిషాలపాటు మండించి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చారు. కర్ణాటకలోని హసన్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నియంత్రణ కేంద్రం నుంచి ఈ మొత్తం ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా శాస్త్రవేత్తలు నియంత్రించగలిగారు. ప్రస్తుతం 15 గంటల 56 నిమిషాలకోసారి ఉపగ్రహం తన కక్ష్యలో పరిభ్రమిస్తోందని తెలిపారు.
Comments