విశాఖ నావీ డాక్ యార్డ్ లో ఘోర ప్రమాదం: 5 గురి మృతి

విశాఖపట్నం,మే 18:  : విశాఖ నావీ డాక్ యార్డ్ లో  బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో అయిదుగురు నేవీ సిబ్బంది మృతి చెందారు. మృతి చెందినవారిలో కమాండర్, అసిస్టెంట్ కమాండర్, కెప్టెన్, సెయిలర్, మాస్టర్ చీఫ్ ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో పదిమంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఐఎన్‌ఎస్ కళ్యాణి ఆస్పత్రికి తరలించారు. సబ్ మెరైన్ మరమ్మతులు చేస్తుండగా మత్స్యడ్రైడాక్‌లో గేట్లు విరిగి నీరు లోనికి ప్రవేశించింది. బిల్డింగ్ సెంటర్ గేటు ఒక్కసారిగా కూలిపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు