Saturday, April 30, 2011

ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతాo: జగన్

కడప,ఎప్రిల్ 30:     ఏడాదిలోపు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారం లో పాల్గొంటూ, త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతామని చెప్పారు. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ తాము అమలు చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ చనిపోయాక ఒక్క పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయలేదన్నారు.  
చంద్రబాబు కాన్వాయ్ పై దాడి
కొమ్మునూతల గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై స్థానిక ప్రజలు రాళ్లు రువ్వారు. బురద చల్లారు. చంద్రబాబుతోపాటు మైసూరా రెడ్డి వేసుకున్న చొక్కాలపై బురద పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని విమర్శించడంతో స్థానిక ప్రజలు ఆగ్రహంతో  ముందు  బురద చల్లారు. ఆ తరువాత రాళ్లు రువ్వారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు దాడి చేశారు. రాళ్లు రువ్వారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...