ఖట్మండూ,ఏప్రిల్ 26: భగవాన్ సత్యసాయిబాబా నిర్యాణం నేపాల్లో వేలాదిమంది భక్తుల్లో విషాదాన్ని నింపింది. సాయిబాబా అస్తమయంపై విచారం వ్యక్తంచేస్తూ నేపాల్ ప్రధాని జలానాథ్ ఖణాల్ సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ‘సత్యసాయిబాబా అస్తమయంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది భక్తుల్లో ప్రేమ, సేవాభావాలను పెంపొందించిన ఆధ్యాత్మిక మూర్తి మనమధ్య లేకపోవడం మానవాళికి తీరని లోటు’ అని ఆయన పేర్కొన్నారు. నేపాల్లో బాబాకు అనేకమంది భక్తులు ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా సాయి భక్తులు భజనలు, ప్రార్థనలు చేస్తున్నారు. సాయి మరో అవతారంలో తిరిగి వస్తారని వారు విశ్వసిస్తున్నారు. నేపాల్లో 186 సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నట్టు ఖట్మండూ లోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు తెలిపింది. బాబా నిర్యాణం వార్త వినగానే వేలాదిమంది భక్తులు తమ శ్రద్ధాంజలి ఘటించడానికి పుట్టపర్తికి బయలుదేరారని ట్రస్టు వర్గాలు తెలిపాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment