Thursday, April 21, 2011

వివాదoలో లోక్‌పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీ కో చైర్మన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: వివాదస్పద సీడీ వ్యవహారంలో లోక్‌పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీ కో చైర్మన్ శాంతిభూషణ్ కు   ఎదురుగాలి వీస్తోంది. వివాదస్పద సీడీలో వున్న శాంతిభూషణ్ సంభాషణల్ని ట్యాంపరింగ్ చేయలేదని హైదరాబాద్ ఫోరెన్సిక్ లాబ్ ధృవీకరించినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వివాదస్పద సీడీలపై హైదరాబాద్ ఫోరెన్సిక్ అధికారులు అందించిన రిపోర్టును ఢిల్లీ పోలీసులు గురువారం అందుకున్నారు. సమాజ్‌వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అప్పటి ఎస్పీ నాయకుడు అమర్‌సింగ్‌లతో శాంతి భూషణ్ జరిపిన సంభాషణలతో కూడిన సీడీలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాంతి భూషణ్‌పై అమర్‌సింగ్, దిగ్విజయ్ సింగ్ విమర్శనాస్ర్తాలు పదునెక్కాయి. శాంతి భూషణ్‌పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడే ఉన్నానని దిగ్విజయ్ మరోసారి పునరుద్ఘాటించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...