Monday, April 25, 2011

సచిన్ కంట తడి

పుట్టపర్తి,ఏప్రిల్ 25:  పుట్టపర్తి సత్య సాయి బాబా పార్ధివ దేహాన్ని చూసి  సచిన్ టెండూల్కర్ కంట తడి పెట్టారు.   సత్య సాయి బాబాను కడసారి చూడడానికి సచిన్ తన భార్య అంజలితో కలిసి సోమవారం పుట్టపర్తి వచ్చారు. వారితో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన చాముండేశ్వరినాథ్ కూడా ఉన్నారు. సత్య సాయి బాబా మరణంతో సచిన్ టెండూల్కర్ ఆదివారం విషాద వదనంతో కనిపించారు. తన 38వ జన్మదిన వేడుకలను జరుపుకోలేదు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...