ఐఎస్డీ కాల్ చార్జీలు తగ్గించిన బీఎస్ఎన్ఎల్
హైదరాబాద్, మే 1: వినియోగదారుల సౌకర్యార్థం తొలిసారిగా ఐఎస్డీ కాల్ చార్జీలు తగ్గించేందుకు ప్రత్యేక రీచార్జ్ వోచర్లను ప్రవేశపెట్టనున్నట్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీజీఎం రాజీవ్ అగర్వాల్ తెలిపారు. ఈ వోచర్లు మే 5 నుంచి 90 రోజులపాటు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో వైర్లెస్ ఫోన్ల విభాగంలో బీఎస్ఎన్ఎల్ ఆరో స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకున్నట్లు వివరించారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మే మాసాన్ని ‘కస్టమర్ డిలైట్ మంత్’గా పాటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్సీ 200 రీచార్జి పై రూ. 205 టాక్టైం అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఉన్న బ్రాడ్బాండ్ హోమ్ అన్లిమిటెడ్ ప్లాన్లో డాటా డౌన్లోడ్ సామర్థ్యాన్ని 256 కేబీపీఎస్ ( అన్లిమిటెడ్) నుంచి 512 కేబీపీఎస్కు (2 జీబీ వరకు) పెంచినట్లు తెలిపారు. మొబైల్ నంబర్ పోర్టబులిటీలో ఇప్పటి వరకు అగ్రస్థానం బీఎస్ఎన్ఎల్దే అన్నారు.
Comments