భారత సంతతికి పులిట్జర్ అవార్డు

వాషింగ్టన్ ,ఏప్రిల్ 19:  ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్ క్యాన్సర్ వైద్య నిపుణుడు సిద్ధార్థ ముఖర్జీ సొంతం చేసుకున్నారు. నాన్ ఫిక్షన్ కేటగిరిలో ‘ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలాడీస్: ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్’ పుస్తకానికి పులిట్జర్ పురస్కారందక్కింది. క్యాన్సర్ మహమ్మారికి  సంబంధించిన చికిత్స, పరిశోధన అంశాలను ఈ పుస్తకంలో పొందిపరిచారు. దూమపానానికి  వ్యతిరేకంగా, బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లాంటి పలు కార్యక్రమాలను  ముఖర్జీ చేపట్టారు. ముఖర్జీ ఢిల్లీ నగరంలో జన్మించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు