అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
హైదరాబాద్ ,ఏప్రిల్ 22: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. . ఉభయగోదావరి,, కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాలో మిర్చి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, అనంతపురం జిల్లాలో మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Comments