Friday, April 29, 2011

టిఆర్ఎస్ అధ్యక్షుడుగా తిరిగి కె.సి.ఆర్.

కాంగ్రెస్ పార్టీకి విలీనం పిచ్చి...ఎందుకు కలుస్తా0...!మహబూబ్ నగర్ ,ఏప్రిల్ 29:  తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుగా కె.చంద్రశేఖర రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిఆర్ఎస్ ప్రతినిదుల సభలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సభలో అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ సభలో తీర్మానం చేశారు.  చంద్రశేఖర రావు  ఈ సందర్భంగా మాట్లాడుతూ,  టిఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని  స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి విలీనం పిచ్చిపట్టుకుందన్నారు. పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కే డిపాజిట్ దక్కలేదని, అటువంటి పార్టీలో తాము ఎందుకు కలుస్తామని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ప్రజలు బంగాళ ఖాతంలో విలీనం చేస్తారన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...