ఇక పని చేస్తేనే జీతాలు
హైదరాబాద్, ఏప్రిల్ 14: పెన్ డౌన్, చాక్ డౌన్, టూల్ డౌన్, సహాయ నిరాకరణలతో సహా ఎలాంటి ఆందోళన చేసినా ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. వారికి సమ్మె చేసే హక్కు లేదని పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని పేర్కొంది. పని చేయకపోతే జీతాలిచ్చే సమస్యే లేదని తేల్చి చెప్పింది. ఆందోళన సమయంలో విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇబ్బంది కలిగిస్తే క్రిమినల్ చర్యలూ తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆటలాడినా, డ్రమ్ములు వాయించినా కూడా క్రమశిక్షణ వేటు ఖాయమని కరాఖండిగా చెప్పింది. ఈ మేరకు జీవో నంబర్ 177ను బుధవారం ప్రభుత్వం జారీ చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 14: పెన్ డౌన్, చాక్ డౌన్, టూల్ డౌన్, సహాయ నిరాకరణలతో సహా ఎలాంటి ఆందోళన చేసినా ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. వారికి సమ్మె చేసే హక్కు లేదని పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని పేర్కొంది. పని చేయకపోతే జీతాలిచ్చే సమస్యే లేదని తేల్చి చెప్పింది. ఆందోళన సమయంలో విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇబ్బంది కలిగిస్తే క్రిమినల్ చర్యలూ తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆటలాడినా, డ్రమ్ములు వాయించినా కూడా క్రమశిక్షణ వేటు ఖాయమని కరాఖండిగా చెప్పింది. ఈ మేరకు జీవో నంబర్ 177ను బుధవారం ప్రభుత్వం జారీ చేసింది.
No comments:
Post a Comment