Tuesday, April 26, 2011

సాయిబాబాకు మన్మోహన్ సోనియా నివాళులు

పుట్టపర్తి,ఏప్రిల్ 26: ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ సత్యసాయిబాబాకు ఘన నివాళులర్పించారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో మన్మోహన్, సోనియా పుట్టపర్తికి చేరుకున్నారు. బాబా పార్ధీవ శరీరం వద్ద మన్మోహన్, సోనియాలు మౌనంగా నివాళులర్పించారు. ప్రధాని, సోనియాల వెంట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్‌ వున్నారు. సత్యసాయి బాబా అవతార పురుషుడని పధానమంత్రి మన్మోహన్‌సింగ్ అభివర్ణించారు. ఆయన ఆధ్యాత్మిక తత్వం మానవాళికే ఖ్యాతిని తెచ్చిపెట్టిందని తెలిపారు. కోట్లాది మందిలో ఆశాభావాన్ని రేకెత్తించిన మహోన్నత వ్యక్తి బాబా అని, ఆయనకు ప్రణామములు అర్పిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు.
ట్రస్ట్ సమావేశం
 సత్యసాయి మరణాంతరం తొలిసారి ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబా ఆత్మకు శాంతి చేకూరాలని తొలి తీర్మానాన్ని ట్రస్ట్ సభ్యులు అమోదించారు. సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు కల్పించకుండా యధావిధిగా కొనసాగిస్తామని  సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ పేరిట విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. బాబా ఆశయాల్ని కొనసాగించడమే తమ ముందు వున్న ప్రధాన కర్తవ్యమని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...