సాయి బాబాను కీర్తించిన బ్రిటీష్ మీడియా

లండన్,ఏప్రిల్ 26: భౌతిక దేహం వీడిన భగవాన్ సత్యసాయి బాబాను బ్రిటీష్ మీడియా అవతార పురుషుడిగా స్తుతించింది. గత శతాబ్దంలోని సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్తల్లో భగవాన్ సత్యసాయి బాబా ఒకరని డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. సర్వం తెలిసిన సర్వాంతర్యామిగా బాబాను పొడిగింది. బాబాను భక్తులు కనిపించే దేవుడిగా కొలుస్తారని, ఆయన మాత్రం అందరిలో దైవాన్ని చూశారని పేర్కొంది. అన్ని మతాలను సమానంగా ఆదరించి, ప్రేమ మార్గాన్ని భక్తులకు ప్రవచించారని ప్రస్తుతించింది. బాబాను భారతదేశంలో అత్యంత జనాదరణ కలిగిన ఆధ్యాత్మిక గురువుగా ద టైమ్స్ పత్రిక పేర్కొంది. సత్యం, శాంతి, ప్రేమ, అహింసా బోధనల ద్వారా బాబా సుప్రసిద్ధులయ్యారని తెలిపింది. విశ్వవ్యాప్తంగా బాబాకు భక్తులున్నారని గార్డియన్ పేర్కొంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు