డెవిల్స్ ను చిత్తు చేసిన ఛార్జర్స్
న్యూఢిల్లీ,ఏప్రిల్ 19: ఢిల్లీ డేర్డెవిల్స్ ను చిత్తు చేసి డెక్కన్ ఛార్జర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారమిక్కడ జరిగిన మ్యాచ్లో డెక్కన్ చార్జర్స్ 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. సోహల్(62), సారథి సంగక్కర(49), వైట్(31)లు రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఛార్జర్స్ జట్టు 168 పరుగులు చేసింది. భారీలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన డేర్డెవిల్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో డ్ వార్నర్ ఒక్కడే రాణించి అర్ధసెంచరీ (51) చేశాడు. ఛార్జర్స్ బౌలర్లలో క్రిస్టియన్, హర్మీత్సింగ్ చేరో రెండు వికెట్లు తీసుకోగా, ఓజా, మిశ్రా, ధావన్లు తలో వికెట్ పడగొట్టారు.
Comments