Friday, April 15, 2011

సీడి వివాదంలో లోకపాల్ కమిటీ కో-ఛైర్మన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:  అవినీతి నిరోధానికి ఏర్పాటయిన లోకపాల్ డ్రాఫ్టింగ్ కమిటీ తొలి సమావేశానికి ఒకరోజు ముందే కమిటీ సహ ఛైర్మన్‌ పై ఓ వివాదం చెలరేగింది. లోకపాల్ కమిటీ సహ ఛైర్మన్, మాజీ న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఆ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌లతో మాట్లాడినట్లు భావిస్తున్న సీడి వెలుగులోకి వచ్చింది. ములాయంసింగ్‌కు సంబంధించిన న్యాయసంబంధ విషయంలో జ్యోకం చేసుకోవాలని కోరుతూ అమర్‌సింగ్ శాంతిభూషణ్‌ను కలిసినట్లు సీడీ సంభాషణల్లో నమోదయింది.అయితే ఈ సీడీ కల్పితమని శాంతిభూషణ్, అమర్‌సింగ్ పేర్కొన్నారు. ఈ సీడి వ్యవహారంపై శాంతిభూషణ్ పోలీసు కేసు నమోదుచేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...