‘అంకుశం' రామిరెడ్డి మృతి

హైదరాబాద్,ఏప్రిల్ 14 : ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామిరెడ్డి  మరణించారు. రామిరెడ్డి ‘అంకుశం’ సినిమాలో విలన్ పాత్రతో ప్రేక్షకుల మన్నన పొందారు. అప్పటినుంచి ఆయన   ‘అంకుశం' రామిరెడ్డిగా పేరు పొందారు. అమ్మోరు, అనగనగా ఒకరోజు, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, పెద్దరికం, గాయం, బలరామకృష్ణులు, ఓసేయ్ రాములమ్మ సినిమాల్లో ప్రతి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రామిరెడ్డి మృతి పట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు