వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ ' సీలింగ్ ఫ్యాన్'
హైదరాబాద్,ఏప్రిల్ 21: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీలింగ్ ఫ్యాన్ను ఎన్నికల కమిషన్ కేటాయించింది. జగన్, వైఎస్ విజయమ్మలకు కామన్ సింబల్ లభించింది. కాగా, ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కడప లోకసభ పోటిలో 42 మంది అభ్యర్థులు మిగిలారు. బ్యాలెట్ పత్రంలో జగన్కు ఆరవ స్థానాన్ని కేటాయించారు. ఇక పులివెందుల ఉప ఎన్నికల బరిలో 24 మంది మిగిలారు. ఈ నియోజకవర్గంలోని బ్యాలెట్ పేపర్లో వైఎస్ విజయమ్మకు 8వ స్థానాన్ని కేటాయించారు.
Comments